జనం కోసం జనసేన 567వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 567వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం, వెంగయ్యమ్మపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 700 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 568వ రోజు కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం ఖె.గోపాలపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి దంపతులు తెలిపారు. బుధవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, జగ్గంపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిని మరిశే శ్యామల, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, వెంగయ్యమ్మపురం నుండి గ్రామ అధ్యక్షులు కోన నానాజీ గారికి, నగిసెట్టి శివ, అప్పాన ఫణీంద్ర, కుమార సింగర్రావు, సండ్రాని దుర్గాప్రసాద్, ముమ్మన వీరదుర్గ, అప్పాన దుర్గ, వేపాడి శ్రీరామ్, వల్లెపు విజయ్, చెరకాని మణికంఠ, వేపాడి భానుప్రసాద్, కొట్టేడి అచ్చిరాజు, మరిశే బాపూజీ, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలాని శివాజీ, నేదూరి అశోక్, శ్రీమంతుల నాని, శ్రీమంతుల ప్రశాంత్ కుమార్, మందపల్లి చందు, గుంటముక్కల బుల్లి కృష్ణ, మల్లిసాల నుండి చీకట్ల దుర్గాప్రసాద్, రామవరం నుండి దివిటీ నగేష్, కొత్తపల్లి నుండి జాజుల శ్రీను, పువ్వల శ్రీదేవి, మల్లవరం నుండి వట్టికూటి జనార్ధన్, గోళ్ళ విజయ్, బూరుగుపూడి నుండి పాటంశెట్టి చిన్న రామకృష్ణ, కోడి గంగాధర్, తుంపాల అర్జున్, తుంపాల పవన్, పసుపులేటి సతీష్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజులకు పాటంశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అంకం ఓమ్ కృష్ణ కుటుంబ సభ్యులకు, తమటం నాగేంద్ర కుటుంబ సభ్యులకు, తిరనాల శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.