జనం కోసం జనసేన మహాయజ్ఞం 736వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 736వ రోజు కార్యక్రమం గురువారం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 737వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం, ముక్కొల్లు గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కోడి గంగాధర్, గోనేడ నుండి బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, డేగల రాంబాబు, సోమవరం నుండి డేగల నరేష్, ఎస్. తిమ్మాపురం నుండి కంటే తాతాజీ, పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్ లకు కృతజ్ఞతలు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు.