చిందాడగరువులో 73వ గణ తంత్రవేడుకలు

తూర్పుగోదావరి, అమలాపురం రూరల్ చిందాడగరువులో పలు చోట్ల 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సచివాలయం వద్ద, ఎమ్ పి పి యు పి పాఠశాల, నక్కా వారి హరిజన పేట, యు.పి. స్కూల్ లో జనసేన పార్టీ ఎమ్ పి టి సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర రావు కోవిడ్ నియంత్రణలు పాటిస్తూ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, సర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.