మాధవరెడ్డి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంఛార్జి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశ ప్రజలందరికీ అందుతున్న స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఫలితాల కోసం నాడు ప్రాణ త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధుల కృషినీ స్మరించు కుంటూ వారి పాత్ర దేశ అభివృద్ధిలో ఎంతో ప్రశంసనీయం అని వారి స్ఫూర్తితో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పోరాడి సాధించిన రాష్ట్రం కేవలం ఒక కుటుంబ పాలనలో నలిగిపోతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వీరమహిళలు పుష్పకళ, నాగలక్ష్మి, మహాలక్ష్మి, మరియు జనసైనికులు అరుణ్ కుమార్, సరోజ్ప్రదీప్, హనుమంతు, లక్ష్మీనారాయణ, హరినాయక్, మల్లేష్ ముదిరాజ్, మహేష్, రాజగోపాల్, శివ, రవి, పవన్, బీమా, కుమార్ మరియు ఇతర జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు, వీరమహిళలకు, నాయకులకు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.