వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే : తులసి ప్రసాద్

పూతలపట్టు: వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉందని పూతలపట్టు నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసి ప్రసాద్ అన్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పూతలపట్టు మండలంలో గడపగడప కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆయన పర్యటనని బహిష్కరించడం వారి పరిపాలన విధానంలో లోపాలను ఎత్తిచూపడం జరిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలో ఉంది అనడానికి ఒక ఉదాహరణ. గ్రామస్తులపై ప్రజాప్రతినిధిగా ఉంటూ అసభ్యకరంగా మాట్లాడడం బాధాకరం. స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన ధనాన్ని తిరిగి ఇచ్చేయమనడం, ప్రభుత్వ పథకాలను వారికి రానివ్వకుండా చూస్తాను అనడం ప్రజాస్వామ్యం కాదు. ఆయన మాటలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలను బెదిరించి రాజకీయం చేసే అలవాటు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోవాలని, ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉందని గుర్తు చేసుకోవాలి. అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరి అభివృద్ధి కొరకు ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుందో స్థానిక ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. పేద మధ్యతరగతి అనే భావాలు లేకుండా, ప్రతి ఒక్కరూ పన్ను రూపంలో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తే అదే డబ్బులను తిరిగి పేద ప్రజల ఉన్నతి కోసం ప్రభుత్వం పని చేస్తుంది, ప్రజా ప్రతినిధులు వారి జోబిలో ఉన్న డబ్బులు తీసి ప్రజలకు ఇవ్వడం లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని, జనసేన పార్టీ కోరుతుంది అని పూతలపట్టు వ్యవహారాలు చూసుకుంటున్న, జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసి ప్రసాద్ తెలియజేశారు.