అనంతపురంలో ఇంటింటా జనసేన

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా అనంతపురం నియోజకవర్గంలో ఆదర్శనగర్, అశోక్ నగర్, హౌసింగ్ బోర్డ్, రామకృష్ణ నగర్, భవాని నగర్ నందు క్రియాశీలక సభ్యులను కలిసి “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేసి, వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్సేల్ అధ్యక్షుడు లాయర్ మురళీకృష్ణ, మెరుగు శ్రీనివాసులు, అశోక్ నగర్ రవికుమార్, సాయి నగర్ రామకృష్ణ, భవాని నగర్ మంజునాథ్, మధుసూదన్, హరీష్ నాయక్, ప్రవీణ్ కుమార్, వెంకటాద్రి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.