వారాహి యాత్ర సంఘీభావ బైక్ ర్యాలీ విజయవంతం

అవనిగడ్డ నియోజకవర్గం: బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన వారాహి యాత్రకి సంఘీభావంగా జనసేన పార్టీ మోపిదేవి – చల్లపల్లి – ఘంటశాల మండలాల మూడు మండలాల అద్యక్షుల అధ్వర్యంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి , చల్లపల్లి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి మరియు ఘంటశాల శ్రీ జలదిశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు మండలాల పరిధిలోని జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న జిల్లా కమిటి నాయకులు, అవనిగడ్డ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మూడు మండలాల పరిధిలోని మండల కమిటీ నాయకులు, గ్రామ నాయకులు, వీర మహిళలు మరియు జన సైనికులు పాల్గొన్నారు. ఇంతటి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మొదటి నుండి చివరి వరకు నిలబడి కార్యక్రమం విజయవంతం అవడంలో అండగా నిలిచిన జనసైనికులకు మరియు మోపిదేవి నుండి ఘంటశాల వరకు వారితో పాటు ఉంటూ వారికి ప్రభుత్వం తరుపున భద్రత కల్పించిన మూడు మండలాల పరిధిలోని ఉన్న పోలీస్ అధికారులకు అలాగే వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.