దాడులకు భయపడే పార్టీ జనసేన కాదు: వంగ లక్ష్మణ్ గౌడ్

• నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కనుసైగలోనే నా మీద దాడి జరిగింది.
• మీ ఉడత ఊపుల్లకు, మీ చెంచాల దాడులకు భయపడే వ్యక్తి కాదు వంగ లక్ష్మణ్ గౌడ్
• మీకు యుద్ధమే కావాలి అంటే మేము బలంగా ఇవ్వగలం కానీ అది ప్రజాస్వామ్యానికి హాని.
• నాగర్ కర్నూల్ బి.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, గౌడ, బహుజన బిడ్డలారా ఆలోచించండి, మనల్ని రాజ్యాధికారం వైపు నడిపించాల్సిన పార్టీలు మనల్ని బానిసల్లా మారుస్తున్నారు…
ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.

తెలంగాణ, నాగర్ కర్నూల్, నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు బుధవారం వంగ లక్ష్మణ్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ పట్టణంలో జడ్.పి.హెచ్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధ్వర్యంలో ఆయన కనుసైగలో వారి అనుచరులు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ మీకు నిజంగానే గెలుస్తాము అనే ధైర్యం ఉంటే నిజంగా గెలుపు మాదే అనే దమ్ము ఉంటే ఈరోజు ప్రజల మధ్యలో ఎందుకు తిరుగుతున్నారు. పదేళ్ల ప్రస్థానం పాదయాత్ర అంటూ ఎందుకు తిరుగుతున్నారు..?నిజంగా మీరు నాగర్ కర్నూల్ ప్రజలకు మంచి చేసి ఉంటే నిజంగా నాగర్ కర్నూల్ ను అభివృద్ధి చేశాం అనే నమ్మకం ఉంటే, నిజంగా నాగర్ కర్నూల్ ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తే మీరు వెళ్లి మీ బెడ్ రూమ్ లో పడుకోండి అబ్బా, మీరు చేసిన మంచి మిమ్మల్ని గెలిపిస్తది కదా, మీకూ ఓడిపోతానని భయం మీలో ఉంది కాబట్టే దాడులకు పాల్పడుతున్నారని, పదవి అనే అహంకారం డబ్బు అనే మదంతో నాగర్ కర్నూల్ లో నా అంత మగాడు లేడు అని నాగర్ కర్నూల్ లో నాకు పోటీ లేడు అని విర్రవీగుతూ మాట్లాడుతున్న మీ మాటలకు, మీ దోపిడీలను, మీ దౌర్జన్యాలను, మీ నల్లమట్టి దందాలను అడ్డుకోవడానికి నేనే పోటీ. ఒక్క బిసి బిడ్డ, ఒక్క బహుజన బిడ్డ నిన్ను. నీ అవినీతి పాలనను ప్రశ్నిస్తే, దాడులు చేయిస్తావా అని, ఏరోజు అయితే పోతిరెడ్డిపల్లి గ్రామంలో, నా మీద కక్షపుర్వకంగా మీరు పెట్టిన ప్రెస్ మిట్ ఎదైతే ఉందో అక్కడి నుంచే నీ పతనం మొదలైందని అన్నార్. ప్రాణాలకు భయపడే వాడు కాదు వంగ లక్ష్మణ్ గౌడ్ గుర్తుంచుకో, నాగర్ కర్నూల్ లో ఒక బిసి పాలన, ఒక బహుజన పాలన తిరిగి తీసుకురావాలనే ఆశయంతో జనసేన పార్టీ కండువా వేసుకున్న రోజునే ప్రాణాలకు తెగించి వచ్చాను. మీ ఉడత ఊపుల్లకు, మీ చెంచాల దాడులకు భయపడే వ్యక్తి కాదు వంగ లక్ష్మణ్ గౌడ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యొక్క కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, జాని, ఎదుల శరత్ గౌడ్, కొడిగంటి సాయి, పేరుమాల శేఖర్, మూర్తి నాయక్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, మహేష్, చెన్నామొని మహేష్, చందు, సురేష్, గద్వాల్ మహేష్, లింగం నాయక్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.