దోసులోడికి గ్రామంలో పర్యటించిన జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లులోని, దోసులోడికి గ్రామంలో పర్యటించిన అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ స్థానిక జనసైనికులు తెలిపిన వివరాల మేరకు దోసు లోడికి గ్రామం నందు సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో స్మశానం వాటిక.. 2వేల పైచిలుకు జనాభా కలిగిన దోసులోడికి గ్రామం నందు మనుషులు కాలం చేసిన తర్వాత అంతక్రియలు నిర్వహించడానికి ఉన్న స్థలం కేవలం రెండు సెంట్లు మాత్రమే. ఈ సమస్య ఎన్నో సంవత్సరాలగా నెలగొంది ఈ సమస్యను దోసులోడికి గ్రామ జనసైనికులు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి అలిసిపోయిన వారు నేడు గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్ దృష్టికి తీసుకొని రాగా, వెంటనే స్థానిక స్మశానం వాటికను పరిశీలించి దీని ప్రత్యామ్యాయం కోసం జనసేన పార్టీ పోరాడుతుందని స్పష్టం చేయడం జరిగింది.