శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి బాబు పాలూరు విరాళం
బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలిలో గల 8వ వార్డు సంత తోట కాలనీలో శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి ఆలయంలో నిర్మాణం కోసం జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఐదు వేల నూతపదహారు రూపాయలు (5116) విరాళంగా బొబ్బిలి జనసైనికులు నిలయంలో ఆలయ కమిటీ వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, వీరమహిళలు, జిల్లా నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-27-at-5.04.22-PM-1024x768.jpeg)