యాదమరి ప్రధాన రహదారి అద్వాన్న పరిస్థితులపై జనసేన వినతిపత్రం

పూతలపట్టు: యాదమరి మండలం పోలీస్ స్టేషన్ నుంచి తమిళనాడు సరిహద్దు కనికాపురం వరకు ఉన్న రోడ్లు బాగు చేసేంతవరకు వివిధ మార్గాల్లో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నాలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు స్పందిస్తూ త్వరలో సమస్యలను పై అధికారులకు తెలిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జనసేన నాయకులు మీడియా సభ్యులతో మాట్లాడుతూ.. సమస్యలపై అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. లేని యెడల పరిష్కరించే వరకు నిరాహారదీక్షకు సైతం సిద్ధం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, జనసేన పార్టీ యాదమరి మండలం ప్రధాన కార్యదర్శి వేముల పవన్, సంయుక్త కార్యదర్శిలు చంద్ర, రమేష్, జెమిని పాండియన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నానబాల లోకేష్, వెంకటేష్, ఎం వెంకటేష్, ప్రభాకర్, కొత్తపల్లి బాలు మరియు జనసైనికులు గాండ్ల వంశీ, ఢిల్లీ బాబు, మాధవ తదితరులు పాల్గొన్నారు.