మీడియా కమిటీని ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్

మంగళగిరి: వారాహి విజయయాత్రలో మీడియా కమిటీ ఎంతో సమన్వయంతో పనిచేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర విజయవంతం అయిన సందర్భంగా యాత్రలో పాల్గొన్న పలు కమిటీ సభ్యులను ఆయన శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభినందించారు. పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కమిటీల్లోని ప్రతీ ఒక్కరినీ పేరుపేరున పలకరించి అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా మీడియా కమిటీ సభ్యులు అజయ్ వర్మ, మలినీడి బాబీ, ఆళ్ళ హరి, శ్రీకాంత్ లు మీడియా హెడ్ హరిప్రసాద్, చక్రవర్తిలకు కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో సరోజ, గంటా స్వరూప, నల్లాల రామకృష్ణ, తోలేటి శిరీష, సుంకర కృష్ణవేణి తదితరులు హాజరయ్యారు.