మంత్రి జోగి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు: పితాని

  • జగన్ పై వీరమహిళతో పోటీచేయించి ఓడిస్తాం

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరంలో మంత్రి జోగిరమేష్ వ్యాఖ్యలకు జనసేన పి.ఎ.సి సభ్యుడు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ ఘటుగా స్పందించారు.. శనివారం ఆయన విలేకరులతో మట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఎక్కడా అవమానించలేదు. వాలంటీర్ల వ్యవస్థను తప్పు పట్టలేదు. ప్రభుత్వం వాలంటీర్ల శ్రమదోపిడీ చేస్తుంది, వాలంటీర్ల ద్వారా ప్రజల సున్నితమైన డేటాను తీసుకుంటోందని మాత్రమే అన్నారని పితాని గుర్తుచేసారు.. మంత్రి జోగి రమేష్ మతి భ్రమించి మాట్లాడతున్నారని ఎద్దేవా చేసారు. మా పార్టీ, మా నాయకుడు ఒంటరిగా పోటీ చేయాలా లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని పోటీచేయాలా అన్నది మా పార్టీకి సంభందించిన విషయం. మీ నాయకుడు సింహం కదా! మేము కలిసి పోటీ చేస్తే సింహం‌ పిల్లి అయిపోతుందా అంటూ చురకలు వేసారు. మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై జనసేన వీరమహిళను పోటీలో నిలిపి ఓడిస్తాం అన్నారు. జోగి రమేష్ నీకు దమ్ముంటే ముమ్మిడివరంలో నాపై పోటీకి రా అంటూ సవాల్ చేసారు. పనికిమాలిన మాటలు పదవిలో ఉన్న కొద్దిరోజులైనా ప్రజా సేవ చెయ్యండి అంటూ హితవు పలికారు.