జనసైనికులకు అండగా జనసేన పార్టీ: అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం, వెంకటంపల్లి గ్రామం జనసేన పార్టీ కార్యకర్త, పార్టీ కార్యక్రమాలలో ముందుండి.. చురుగ్గా పాల్గొనే నాయక్ కొదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయన తలకు తగిలిన దెబ్బ కారణంగా.. కాళ్ళు, చేతులు పని చేయని స్థితికి చేరుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికెరి జీవన్ కుమార్ వారిని పరామర్శించి.. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా వుంటుంది అని బరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, వీరేష్, మహేష్, మణికంఠ, అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.