జగనన్న ఇళ్ళల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండగలరా?: త్యాడ
విజయనగరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా విజయనగరం నియోజకవర్గం, గుంకలాం గ్రామంలో జగనన్న కాలనీలో సందర్శన కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువ నాయకుడు లాలిశెట్టి రవితేజ ఫెయిల్యూర్ అఫ్ జగనన్న కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా శనివారం ఉదయం గుంకాలం జగనన్న కాలనీలో ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది చందంగా జగనన్న కాలనీ పేరుతో నాణ్యత లేని నిర్మాణంతో కనీసం మంచినీరు, రోడ్లు, మరుగు దొడ్లు వివిధ మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలను అన్యాయం చేస్తున్నారని, ఇటువంటి కాలనీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక శాసన సభ్యులు, జిల్లాకు చెందిన వైసీపి మంత్రులు ఉండగలరా అని ప్రశ్నించారు. జనసేన ప్రజల పక్షాన నిలబడుతుందని, ఇటువంటి ప్రజలకు అన్యాయం చేసిన ఏ కార్యక్రమాల పైన ఐనా పార్టీ ఆదేశాల మేరకు పోరాడతామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-6.35.26-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-6.35.27-PM-1024x461.jpeg)