జగనన్న కాలనీలో చిలకం మధుసూదన రెడ్డి, జిల్లా పత్తి చంద్రశేఖర్ పర్యటన

  • జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న కాలనీల పేర్లు మార్చి స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడతాం
  • శ్రీ సత్యసాయి జిల్లాలో గత 4 సంవత్సరాల నుండి జగనన్న కాలనీలలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసిన పాపాను పోలేదు
  • పుట్టపర్తి ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి నీ తప్పులను ఇప్పటికైనా సరిదిద్దుకో
  • వైసీపీ మట్టి మాఫియా ఆఖరికి జగనన్న కాలనీలను కూడా వదలకుండా కొండను తవ్వి మట్టిని అమ్ముకున్నారు.

పుట్టపర్తి నియోజకవర్గం: కొత్తచెరువు మండలంలోని జగనన్న కాలనీలలో చిలకం మధుసూదన రెడ్డి, పార్టీ నాయకులతో సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి మోసాల గురించి మాట్లాడుతూ జగనన్న కాలనీలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు పేదలకు ఇచ్చిన గృహాలు ఎక్కడో ఒక పెద్ద కొండను తవ్వి కొండ పక్కన వాగుల్లో పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని అవి వారికి ఉపయోగపడేవి కాదని గృహ నిర్మాణాల పేరుతో పేదలను అప్పులపాల చేస్తున్నారని ఈ కాలనీలలో రోడ్లు వేయడం కానీ కరెంట్ సప్లై ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి చేసిన పాపాన పోలేదని అక్కడ ఉన్న గుంతలు, మిట్టలు వలన నడవడానికి కూడా వీలులేదని ప్రస్తుతం పునాదులన్నీ శిధిలావస్థకు చేరుకుంటున్నాయని ఈ ప్రభుత్వం దాదాపుగా 6 లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికోసం ఖర్చు పెట్టారని కేవలం వారి కార్యకర్తల కోసమే అక్కడక్కడ ఇల్లులు కట్టించారని పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కాలనీలను తప్పకుండా అభివృద్ధి చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, అబ్దుల్ అబు, కొత్త చెరువు మండల అధ్యక్షులు శివ ప్రసాద్, పుట్టపర్తి మండల అధ్యక్షులు తలారి పెద్దన్న, బుక్కపట్నం మండల అధ్యక్షుడు అల్లాడి జయరాం పాల్గొన్నారు.