నా దాతృత్వం: బిగ్ బీ అమితాబ్

కరోనా నుండి కోలుకొని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బిగ్ బీ అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. తాజాగా ఓ మహిళ అమితాబ్ ను దాతృత్వం గురించి  ప్రశ్నించగా. ఈ ప్రశ్నకు స్పందించిన అమితాబ్ తన బ్లాగులో ఒక పోస్ట్ చేశారు.

తను చేస్తున్న సహాయాల గురించి బయటపెట్టారు. `నా దాతృత్వం గురించి మాట్లాడకపోవడాన్ని ఈ రోజు ఓ మహిళ ప్రశ్నించింది. చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోకూడదని నేను నమ్ముతాను. కానీ, మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింద`ని అమితాబ్ పేర్కొన్నారు. `ఆంధ్రప్రదేశ్, విదర్భ, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాం. సినీ పరిశ్రమకు చెందిన పది వేల కుటుంబాలకు ఆరు నెలలుగా రేషన్, ఆహారం అందిస్తున్నాం. ముంబై నుంచి తమ స్వగ్రామాలకు కాలినడకన బయల్దేరిన వలస కార్మికులకు 12,000 జతల చెప్పులు అందించాం. నాసిక్ హైవే మీద వాళ్లకు ఆహారం, నీళ్లు అందించాం. చార్టెర్డ్ ఫ్లైట్‌లు బుక్ చేసి వీలైనంత మందిని వారి స్వగ్రామాలకు తరలించాం. కరోనా యోధులకు 15 వేల పీపీఈ కిట్స్, 10 వేల మాస్క్‌లు అందించామ`ని అమితాబ్ తెలిపారు.