మాడుగుల జనసేన విస్తృత స్థాయి సమావేశం
మాడుగుల నియోజకవర్గం: ఘాట్ రోడ్ లో వున్న జనసేన పార్టీ కార్యాలయంలో రాయపు రెడ్డి కృష్ణ, కాలింగ బలరాం ఆధ్వర్యంలో ఆదివారం మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో తీసుకున్న నిర్ణయంపై చర్చించడం జరిగింది అధ్యక్షులు నిర్ణయానికి నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు జనసేన నాయకులు మద్దతుని తెలియజేయడం జరిగింది. అధ్యక్షులు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని, ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. ఓమ్మలి పంచాయితీకి చెందిన వైసిపి నాయకులు మాజీ స్కూల్ చైర్మన్ తాళ్లపరెడ్డి వెంకటరమణ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఆకర్షితులై ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి వాళ్లనే సాధ్యమని గ్రహించి రాయపు రెడ్డి కృష్ణ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-6.06.41-PM-1024x478.jpeg)