అంబేద్కర్ కి నూజివీడు జనసేన ఆధ్వర్యంలో వినతి పత్రం

రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎంపీలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ కి నూజివీడు జనసేన ఆధ్వర్యంలో వినతి పత్రం

రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎంపీలకు మంచి బుద్ధి ప్రసాదించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని కోరుతూ సోమవారం అంబేద్కర్ జనసేన ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు ప్రకారం జరుగుతున్న డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా 3 వ రోజు విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం అధికార నేతలపై ఒత్తిడి పెంచేందుకు జిల్లా అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ సూచన మేరకు నూజివీడు శ్రీనివాస్ ధియేటర్ నందు గల అంబెద్కర్ విగ్రహం వద్దకు జనసేన కార్యకర్తలు నిరసన తెలియచేసి, ఈ అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి, వైఎస్సార్సీపీ ఎంపీలకు మంచి బుద్ది ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరీదు శివరామకృష్ణ, ఎం సునీల్ కుమార్, తోట వెంకట్ రావు, ఏనుగుల చక్రి, యర్రంశెట్టి రాము, ముత్యాల కామేష్, ఇంటూరి చంటి, యాదాల వెంకటేశ్వర రావు, యు స్మార్ట్ ఉమ, చట్రాయి మండల జనసైనికులు అరెల్లి కృష్ణ, వలసపల్లి రామకృష్ణ, నిస్ట్ల ఉమామహేశ్వరి, సిరి పావని, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.