ఘనంగా కొలిమి ప్రసాద్ జన్మదిన వేడుకలు

మదనపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం మదనపల్లి టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొలిమి ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మదనపల్లి టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, రామసముద్రం ఉపాధ్యక్షలు గడ్డం లక్ష్మిపతి, కుమార్, జనర్దన్, హరినాథ్, కిషోర్, బావజన్, మల్లి, రమేష్, శశి, నవాజ్, ఖలీం, పవన్ తదితరులు పాల్గొన్నారు.