మోత్కూర్ లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తుంగతుర్తి: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు సిరుపంగి అరవింద్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గురువారం మోత్కూర్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సిరుపంగి అరవింద్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల కోసం సొంత సంపాదనతో 5లక్షల రూపాయల భీమా ఇస్తున్నారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తుంగతుర్తిలో జనసేన పార్టీ జెండా ఎగురవేసేవిదంగా జనసైనికులు పనిచేయాలనీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరియు నాయకులు పులుసు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మన తుంగతుర్తి నియోజకవర్గంలో 250 మందికి పైగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఉన్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ జనసేన జెండా నియోజకవర్గంలో ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని దిశ నిర్దేశించారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మీసాల మహేష్, అనిల్, శివ, పవన్, సాయి, సంపత్, యాకస్వామి, పవన్ బూడిద, సాయి, యాసిన్, శేఖర్, చరణ్, నాగరాజు, భాస్కర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.