పరిపాలించడం చేతకాకనే ప్రతిపక్ష నాయకులపై అక్రమకేసులు

• కలిసి కట్టుగా పోరాడదాం వైకాపా రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొడదాం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం.

  • రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత.

అనంతపురం అర్బన్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా గల ఎన్టీఆర్ విగ్రహం వరకు టిడిపి అర్బన్ ఇంచార్జ్ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో టిడిపి వారు చేపట్టిన శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని వారికి జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలిపిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలించడం చేతకాక స్థాయికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆధోగతిపాలు పట్టించి ప్రజల దృష్టిని మరలించడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని దీనిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన టిడిపి పార్టీలు కలసికట్టుగా పోరాటం చేసి వైకాపా రాక్షస పరిపాలనను అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన పార్టీ జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు, జనసేన, టీడీపీ పార్టీల నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.