నందికొట్కూరులో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

నందికొట్కూరు నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను వ్యతిరేకిస్తూ నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన దీక్షా కార్యక్రమం నిర్వహంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు నల్లమల రవికుమార్ పాల్గొని అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మరిచిపోయి కేవలం ప్రతిపక్షాలపై కక్షపూరిత రాజకీయం చేస్తుందని తెలియజేశారు. అలాగే వైసిపి పాలనలో నిరుద్యోగులకు, శ్రామికులకు, రైతులకు ఎలాంటి ఉపయోగాలు లేవని 2024లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి పుష్పరాజు, భాష, బిజినేయమల వెంకటేశు, శేఖరు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.