టిడిపి నేతల నిరసన దీక్షలకు జనసేన సంఘీభావం

అమలాపురం: కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన జైల్లో చేస్తున్న దీక్షకు మద్దతుగా మేముసైతం అంటూ పార్టీ కార్యాలయంలో పలువురు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. నాయకులకు జనసేన నాయకులు డీఎంఆర్ శేఖర్, యాళ్ళనాగ సతీష్, నల్లా శ్రీధర్, కంచిపల్లి ఆబ్బులు, లింగోలు పండు, వర్రేశేషు, కంకిపాటి గోపి, వెదుళ్లపల్లి సుబ్రమణ్యం సంఘీభావం తెలిపారు. దేశం నేతలు యాళ్ళ బ్రహ్మానందం, నడింపల్లి సుబ్రమణ్యం రాజు, చింతా శ్రీను, అడపా కృష్ణ, ఆకుల లక్ష్మణరావు, పోలిశెట్టి భాస్కరరావు, నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, పరమట శ్యామ్ కుమార్, లింగొలు పెద్ధకాపు, మాదిగ దండోరా నాయకులు చుట్టుగుల్ల నీలకంఠ, బొమ్మిడి నాగేశ్వరరావు, బీర రామారావు, బొంతు నాగేశ్వరరావు, గెద్దాడ నాగేశ్వరరావు, పోతుల సుభాష్ చంద్రబోస్, కొప్పానాతి తాతాజీ, వడ్డి సుభాషిణి ఎల్లిషరాజు, ముత్యాల బాబీ, పోతుల నరశిహరావు తదితరులు పాల్గొన్నారు.