కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మేకల కృష్ణ

రాజమండ్రి: జనసేన నాయకులు మేకల కృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అనంతరం రాజమండ్రిలో మొట్టమొదటిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు గౌరవ కందుల దుర్గేష్, పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, ఏలేశ్వరం మండల జనసేన అధ్యక్షులు పెంటకోట మోహన్, జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు సమక్షంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని కందుల దుర్గేష్ కు పూలమాల వేసి శాలువాతో సంత్కారించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, పార్టీ ఆదేశానుసారం పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, ఏలేశ్వరం మండల జనసేన అధ్యక్షులు పెంటకోట మోహన్, జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, జ్యోతుల సీతారాంబాబు, కీర్తి చిన్నా, కొలా నాని తదితరులు ఉన్నారు.