గాడాలలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర 3వ రోజు

  • రాబోయేది జనసేన ప్రభుత్వమే
  • పవన్ కళ్యాణ్ గారే మన ముఖ్యమంత్రి- బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో 3వ రోజు నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జనం కోసం జనసేన మహాపాదయాత్ర చేపట్టారు.కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు బత్తుల వెంకటలక్ష్మికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ కుటుంబసభ్యులుగా ఆప్యాయంగా పలకరిస్తూ భావితరాల భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ బత్తుల అందజేసారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.