చాగంటికి అభిమానుల ప్రశంసలు

నర్సాపురం, జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన చాగంటి ఉమా నాయుడు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణను పలువురు అభినందించారు. బుధవారం పీచుపాలెంలోని ఆయన కార్యాలయంలో నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ముచ్చెత్తారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినందుకు అధిష్టానం గుర్తించి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిందని, ఈ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం తాను చేస్తున్న సేవలను గుర్తించి పదవి ఇచ్చినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు, జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి ద్వారా తనపై మరింత బాధ్యత పెట్టారని, అధినాయకుల ఆలోచనలకు అనుగుణంగా పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మురళీకృష్ణను అభినందించిన వారిలో బెల్లంకొండ నాయుడు, వలవల నవీన్, కుమ్మర పురుగు రాంబాబు, చెన్నం శెట్టి రాజీవ్, ఇంజేటి దానం, మళ్లీపూడి దొరబాబు, తాడి చిన్న, బల్ల శ్రీను, గాది నాని, వినుకొండ రాజు తదితరులు ఉన్నారు.