రెడ్డి అప్పల నాయుడుకి పవన్ కళ్యాణ్ భరోసా

మంగళగిరి, శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు తాడేపల్లిగూడెం జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రానున్న రోజుల్లో మీకు పార్టీ న్యాయం చేస్తుందని రెడ్డి అప్పల నాయుడుకి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి పాల్గొన్నారు.