“ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్” నినాదంతో భారీ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున వేల మంది జనసైనికులు, నాయకులు, వీరమహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. “జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్” అనే నినాదంతో ఇంటింటికీ వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను తెలియజేస్తూ, వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కు ఆశీర్వదించాలని ప్రచారంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం భారీ ఎత్తున శ్రీకాళహస్తి పట్టణం ఏపీ సీడ్స్ సర్కిల్ నుండి నాలుగు మాడ వీధులు మీదుగా దాదాపు 3 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గం నాలుగు మండలాల నుండి వేల సంఖ్యలో నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.