ఉదయగిరిలో కె.ఎస్.ఎస్ సమీక్షా సమావేశం

ఉదయగిరి, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధామాదవ్ కె.ఎస్.ఎస్ ఉదయగిరి ఇన్చార్జి నిమ్మలపల్లి రామచైతన్య ఆధ్వర్యంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందాలి అన్న అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా కానీ కాపులందరూ పెద్దన్న పాత్ర వహించి అన్ని కులాలను కలుపుకొని పవన్ కళ్యాణ్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని 8 పదులు దాటిన వయసులో హరిరామ జోగయ్య చేస్తున్న శ్రమను సఫలీకృతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, కావలి నియోజకవర్గం ఇంచార్జ్ సుధాకర్, కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి, కె.ఎస్.ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జీ శ్రీధర్,కాపు నాయకులు హనుమంత రావు, జనసేన నాయకులు, వీర మహిళలు కె.ఎస్.ఎస్ కమిటీ సభ్యులు మరియు ముఖ్య కాపు నాయకులు పాల్గొన్నారు.