ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం 14వ రోజు

అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లె జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన గురువారం కొత్త వారి పల్లె, రెడ్డిగాని పల్లిలో నిర్వహించడం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న మహిళకు నివసిస్తున్న ఇల్లు పైన ఉన్న సిమెంటు పెంకులు చీలికలు, వర్షాలకు ఇల్లు కారడంతో పక్కింట్లో పసిపిల్లలతో తలదాచుకోవాలని దుఃఖంతో చెప్పడం చాలా బాధాకరమని ఆ మహిళ ఇంటికి కొత్త రేకులు వేయిస్తామని రామాంజనేయులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు ధరణి, మల్లికార్జున, తొక్కోల శివ ప్రసాద్, గంగాధర్, వెంకటేష్, శంకర, ముఖేష్, శివ, మైనారిటి నాయకులు అయాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.