రాత్రి 10 అయినా ఆగని ప్రచారం – ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్న జనం

తెలంగాణ, వైరా, కారేపల్లి మండలంలో బిజెపి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి డా.సంపత్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.