పెనుకొండ నియోజకవర్గంలో డిజిటల్ క్యాంపెయిన్

పెనుకొండ నియోజకవర్గంలో జనసేన – తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం గోరంట్ల మండలంలో జనసేన-టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించి అధ్వాన్నంగా ఉన్న రోడ్లను చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, నియోజకవర్గ నాయకుడు అనిల్ కుమార్, మండల నాయకులు, రాఘవేంద్ర, నరేష్, నాగేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.