కొదమ గూడా గ్రామంలో మంచినీటి సమస్యను తీర్చండి: మురళి

కొండిబ పంచాయతీ, కొదమ గూడా గ్రామంలో సుమారు మూడు నెలలుగా.. మంచినీటి సరఫరా లేక గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతూ.. కలుషితమైన నీటిని తాగడం వలన గిరిజనులు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ నాయకుడు మురళి.. గిరిజనులకు అండగా మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను గమనించి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని తెలిపారు.. లేనియెడల ఇందుకు నిరసనగా సోమవారం నాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరియు గ్రామస్తులతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొర్రా ప్రవీణ్, గుజ్జల మంగళ, దండుసేన నవీన్ కుమార్, కిల్లో ప్రభాకర్, వీర మహిళ, రత్న ప్రియా, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.