ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని గెలిపించాలి: పురందేశ్వరి

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కె. పి. హెచ్. బి డివిజన్, 6 మరియు 9వ ఫేస్ వసంత్ నగర్, ఎన్.టి ఆర్ విగ్రహం దగ్గర నుండి బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రారంభించిన పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ, జనసేన పార్టీ ఆఫీస్ లో పత్రికా సమావేశంలో పాల్గొని, ఆనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి పాదాల వద్ద నుండి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ దేశంలో అవినీతి లేని పరిపాలన సాగిస్తున్నారని అలాంటి నాయకుడు సమక్షంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిజాయితీగల నాయకుడని వారు కూడా నరేంద్ర మోడీ వెంట నడవడం మంచి శుభపరిణామం అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, రేషన్ కార్డులు, నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వంటివి చాలా ఉన్నాయని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం కబ్జా చేశారు. కూకట్పల్లి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తో సాధ్యమవుతుందని చెప్పారు. బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు మీద వేసి సోదరులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా (అర్బన్) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, శ్రీకర్ రావు, ప్రీతం రెడ్డి, ఎ.సూర్యరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు, డివిజన్ నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.