ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సాయమందించిన జనసేన

నరసాపురం మండలం యర్రంశెట్టి పాలెం గ్రామానికి చెందిన మల్లాడి గోపాలం కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున దుబాయ్ పవనిజం సేవాసమితి, మేడిది వెంకట నరసింహారావు, మాలీ కృష్ణాజీ, మాలీ నాగభూషణం, మాలీ సత్య, అయితం పవన్ సత్య స్వరూప్ నర్సాపురం మండల అధ్యక్షులు ఆకెన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ చేతుల మీదగా 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బందెల రవీంద్రబాబు, తెలగంశెట్టి సత్యనారాయణ. పోలిశెట్టి నలిని, వట్టిప్రోలు సతీష్, తోట నాని, యర్రంశెట్టి పవన్, వల్లభరెడ్డి రామకోటి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.