కార్యకర్తలకు వారి కుటుంబానికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది: గాదె
గుంటూరు: జనసైనికుడు వాసు శ్రీనివాసరావు గత కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లి రూరల్ మండలం దూళిపాళ్ల గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. చేతికి అంది వచ్చిన కొడుకు, కుటుంబానికి అండగా నిలబడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబం, కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆ కుటుంబాన్ని, పరామర్శించి, ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చి, ధైర్యంగా ఉండాలని కోరిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమలశెట్టి మల్లేశ్వరి, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద, త్రినాద్, రాజేష్, సత్తెనపల్లి టౌన్ నాయకులు రాడ్డు శ్రీనివాసరావు, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.38.16-PM-1024x576.jpeg)