కోమటిగుంట నందు జనం కోసం జనసేన 27వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కోమటిగుంట నందు 27వ రోజు మంగళవారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ విప్లవ వీరుడు మన్యం దొర అల్లూరి సీతారామరాజు జయంతి మరియు ఆంధ్ర టైగర్ వంగవీటి రంగా జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కోమటిగుంట నందు ప్రతి ఇంటికి ఒక జీవం మొక్కను ఇచ్చి మంగళవారం జమ్ము ముక్కలు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా సామాన్యుడు కూరగాయలు కూడా కొన్ని తినలేని పరిస్థితులు. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ రైతులు నష్టపోతున్నారు. తినే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వాలు, పాలకులు సామాన్యులకు కనీసం కూరగాయలు కూడా కొని తినే పరిస్థితుల్లో లేకుండా ఉంది. అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. రాబోయేది జనసేన, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. రైతులు సుఖసంతోషాలతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో ఎంతో అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించే దానికి జనసేన కృషి చేస్తుందని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, ఖాజా, శ్రీహరి, వినాయతుల, సీనయ్య, తదితరులు పాల్గొన్నారు.