నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టు అప్రజాస్వామికం

చంద్రగిరి, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును ఖండిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసిర్ మాట్లాడుతూ ప్రజల గొంతుకై, ప్రజల కోసం నిలబడితే అరెస్టు చేయడం ఒక ఆంధ్రప్రదేశ్ లోని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నామని, ప్రజలకు పారదర్శకంగా సేవ చేసే ఉన్నత స్థానంలో ఉన్న ఒక ఎంపీ కడుతున్న కాంప్లెక్స్ ముందు వాస్తు దోషంగా పరగనించి విశాఖలోని టైకున్ కూడలిని ముసివేయించడం ఈ వైసీపీ నాయకుల అహకారపూరితమైన అధికారమదానికి నిదర్శనమని అదేవిధంగా అధికారన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ను దోచుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు అని తెలియచేసారు, రాబోయే రోజుల్లో ఈ వైసీపీ అసమర్ధ అన్యాయ అవినీతి రాజకీయాలకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలియచేసారు. నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును చంద్రగిరి నియోజకవర్గం తరపున, ఉమ్మడి చిత్తూరు జిల్లా మైనారిటీ విభాగం తరపున తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసిర్, పాకాల మండల కార్యదర్శి కె.షాజహాన్, జనసేన నాయకులు నాగిరెడ్డి, ఆసిఫ్, తాహిర్, మస్తాన్ పాల్గొన్నారు.