ఎన్డీఏ కూటమి ప్రచారానికి బ్రహ్మరధం పట్టిన పాడేరు ప్రజానీకం

అల్లూరి సీతరామరాజు జిల్లా, జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి గిడ్డి ఈశ్వరి అరకు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీత గారికి గెలుపుకి గ్రామ గ్రామాన గెలుపుకి బ్రహ్మరధం పట్టి గిడ్డి ఈశ్వరి గారికి, కొత్తపల్లి గీత గారికి జై అంటూ కధం తొక్కిన పాడేరు ప్రజానీకం.. జనసేన అరకు పార్లమెంట్ ఇంఛార్జ్ డా!! వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గం, పరిధిలోని, తుంపాడ గ్రామం, గొర్రెలగొంది, గ్రామం, రాములపుట్టు, కిండంగి విలేజ్ లో పర్యటించిన జనసేన పార్టీ నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఓటరు మహాశయులకు అతిపవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజరిటీతో గెలిపించాలని అభ్యర్థించిన పాడేరు జనసేన నాయకులు, అలాగే బీజేపీ జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీలు అధికారంలోకి వస్తె గిరిజనులకు ప్రత్యేక మంచినీటి సరఫరా సూపర్ సిక్ లాంటి పథకాలు అమలు జరుగుతాయి అని వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న పాడేరు జనసేన మండల ఉపాధ్యక్షులు సీసాలి. భూపాల్, కాకినాడ రూరల్ ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ. హెచ్. అనిల్ కుమార్, జనసేన మండల నాయకులు, ముదిలి.సుబ్బారావు, టీడీపీ నాయకులు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.