వైసిపి నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలి

నంద్యాల నియోజకవర్గం: నంద్యాలలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టించిన వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకులపై నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్, చందు, గురు ఫిర్యాదు చేసారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నంద్యాల వైసిపి నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఓటమి భయంతోనే సండే ఎమ్మెల్యే వికృతశిష్టలు చేస్తున్నారని నంద్యాల పట్టణంలో వైసీపీ నాయకులు ఓటమి భయంతో కులాల మధ్య చిచ్చు పెట్ట ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇది ప్రజలందరూ గమనించాలని సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజల ఓట్ల కోసమే పార్టీల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అని ఇప్పటికైనా వైసీపీ నాయకులు పోస్టర్లు సోషల్ మీడియాలో చేసే పోస్టులు వికృతి చేష్టలను చిల్లర రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, గురు, టిడిపి 34 వార్డు కౌన్సిలర్ మావలి, టీడీపి పట్టణ అధ్యక్షుడు మౌలానా, జనసేన, టీడీపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.