పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప గ్రామానికి చెందిన పెమ్మాడి శ్రీను కుమారుడు దావీద్ కుమార్ ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం పల్లంకుర్రు కామరాజుచెరువు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ ఇసుకపట్ల వెంకటేశ్వరరావు కుమార్తె ఇటీవల మృతిచెందగా వారు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం ముమ్మిడివరం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్తిబాబు ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను అదేగ్రామానికి చెందిన జగతా సత్యనారాయణ గారు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను మరియు అదేగ్రామానికి చెందిన చింతక్రింద ఆంజనేయులు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోకా బాలప్రసాద్, సంసాని పాండురంగారావు, బళ్ళ కుమార్, పితాని రాజు, జగతా విజయ్, జగతా సురేష్, సంగాని ధర్మారావు, ఓలేటి శ్రీను, సంగాని జాను, వాసంశెట్టి ఫణి, వాసంశెట్టి, శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.