యాక్సిడెంట్ కి గురైన మాల్యాద్రిని పరామర్శించిన మనోజ్ కుమార్

కొండెపి: ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలం జంగాలపల్లె ఎస్సీ కాలనీకి చెందిన దవనం మాల్యాద్రి శనివారం సాయంత్రం మహేంద్ర ట్రక్ ఆటోలో బియ్యపు తవుడు కొనుక్కునేందుకు వలేటివారిపాలెం మండలం శాఖవరం గ్రామానికి వచ్చి రైస్ మిల్లు దగ్గర తౌడు బస్తాలు లోడ్ చేసుకొని వీఆర్ కోట వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఆటో మీదకి వెళ్లాడు, ఆటో డ్రైవర్ చేయికి ట్రాక్టర్ తగలడంతో చెయ్యి విరిగిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు. ఆ లోడు కనిగిరి వెళ్ళాల్సి ఉందని బాధితుడు తెలిపారు. పరిస్థితి గమనించిన వీఆర్ కోట గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. బాధితుడిని 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ కి పంపారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు మర్రిపూడి మండలం జనసేన నాయకులు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి డాక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఆదివారం లింగసముద్రం మండలం ఎస్ ఐ వద్దకు కూడా వెళ్లి మాట్లాడి యాక్సిడెంట్ కి గురి అయిన దవనం మాల్యాద్రికి అండగా ఉండి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.