మూగజీవాల మృత్యువాతతో నష్టపోయిన గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి

  • పిడుగుపాటుకు 33 మూగజీవులు మృత్యువాత పడిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి….
  • జనసేన మాజీ ఎంపీటీసీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు సాయిబాబా దూరియా.

అల్లూరి జిల్లా, అరకు నియోజకవర్గం, పెదబయలు మండలంలోని ఇంజరి అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పడిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు 33 మూగజీవులు మృత్యువాత పడ్డాయి. ఒకేసారి గిరిజన కుటుంబాలు ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా ప్రభుత్వాన్ని నష్టపోయిన గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ పిఓ దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.