పెదఈర్లపాడులో జనసేన ప్రీమియర్ లీగ్

  • పెదఈర్లపాడు జనసేన నాయకులు మాదాసు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన జనసేన ప్రీమియర్ లీగ్ ఫైనల్ కి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు

కనిగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాలు మేరకు కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వరికూటి నాగరాజు మరియు పిసి పల్లి మండలం పార్టీ అధ్యక్షులు బండారు రాజు సూచనలతో సంక్రాంతి సందర్భంగా, కనిగిరి తాలూక, పిసి పల్లి మండలం పెదఈర్లపాడు గ్రామంలో జనసేన నాయకులు మాదాసు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో తేదీ 18-1-2024, గురువారం నాడు జరిగిన జనసేన ప్రీమియర్ లీగ్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు. జిల్లా కార్యదర్శులు రాయని రమేష్, మరియు రాంబాబు, మరియు రహిముల్లా విచ్చేసి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తదుపరి మాదాసు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు రియాజ్ ను, సమన్వయకర్త వరికూటి నాగరాజు, జిల్లా కార్యదర్శులు రాయిని రమేష్ మరియు రాంబాబుని రహీముల్లాని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడాల నగేష్, మాదాసు మధు, యాట వీరస్వామి, మదాసు సునీల్, కూడాల నాగరాజు, గుత్తి మహిత్, దాసరి అయ్యప్ప, పులి శ్రీకాంత్, టి.డి.పి నాయకులు మాదాసు చిన బ్రహ్మయ్య, ప్రసాద్, మూలే మహేంద్ర మరియు జనసైనికులు, వీరమహిళలు, టి.డి.పి కార్యకర్తలు పాల్గొన్నారు.