మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించిన బొర్రా

సత్తెనపల్లి: 15 వార్డ్ కు చెందిన మక్కన నరసమ్మ పరమపదించారు. ఆ విషయం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుకి గట్టు శ్రీదేవి తెలియజేయగా అప్పారావు గారు గట్టు శ్రీదేవిని పంపించి నరసమ్మకి నివాళులర్పించి, మట్టి ఖర్చులకి ఆర్థిక సహాయం అందించారు. వారికి, వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.