అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు గ్రామంలో పెంకె బాబ్జి షాప్ నందు మట్టపర్తి తాతారావు అద్దెకు నడుపుచున్న పాన్ షాప్ పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురి అయ్యింది. విషయం తెలుసుకున్న ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వారి షాప్ ను చూసి, వారిని పరామర్శించారు. వీరివెంట అత్తిలి బాబురావు, దూడల స్వామి, గుద్దటి విజయ్, సుందరపల్లి సత్యనారాయణ, మర్తుర్తి సత్య మణికంఠ, వంగా సీతారాం ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-28-at-5.46.48-PM-1024x576.jpeg)