అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన తక్షణ సహాయం

పూసపాటిరేగ మండలం, వెల్దూరు పంచాయతీ, కిలుగుపేట గ్రామంలో గత శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో నాయిన కన్నయ్య ఇల్లు కోల్పోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పూసపాటిరేగ మండల జనసేన కార్యవర్గం సోమవారం ఉదయం నాయిన కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులు అందించి, వారికి ప్రభుత్వం నుంచి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, రాష్ట్ర మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, దుక్క అప్పలరాజు, మాదేటి ఈశ్వర్రావు, స్మార్ట్ రమేష్, లెంక సురేష్, జానకీరామ్, వాళ్లె సంతోష్, అల్లాడ జగదీష్, తోటరెడ్డి, కె.పి రెడ్డి, కె.రమణ, కె సిద్దు, సంతోష్, బి. సాయి, పి ఆది, బి. సూర్యప్రకాష్, ఎన్ సంతోష్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.