పెదచెర్లోపల్లి మండలంలో పర్యటించిన జనసేన నాయకులు
కనిగిరి, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎన్నికల సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ సారథ్యంలో పెద్ద చెర్లోపల్లి మండలం అధ్యక్షుడు బండారి రాజు సూచనల మేరకు పెదచెర్లోపల్లి మండలం పరిధిలోని వరిమడుగు గ్రామాలలో పర్యటించి జనసేన కార్యకర్తలని కలసి పార్టీ బలోపేతం గురించి చర్చించి తగుసూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, నజీర్, నాగయ్య, మాల్యాద్రి, శివ, దాసర అయ్యప్ప, టిడిపి యూత్ నాయకుడు మాదాసు బ్రహ్మయ్య మరియు జనసేన కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-15.39.46-1024x768.jpeg)