షేక్షావలికి నివాళులర్పించిన అనంత జనసేన నాయకులు

అనంతపురం నియోజకవర్గపు జనసేన క్రియాశీలక సభ్యులు బాస్ టైలర్ షేక్షావలి స్వర్గస్తులైనారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ… వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు. కీర్తిశేషులు షేక్షావలి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి పరామర్శించిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, వాసగిరి మణికంఠ, పాలగిరి చరణ్ తేజ్, ఎస్.కే.యు రమణ, గవాస్కర్, విజయ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు.